డ్రంకెన్‌ డ్రైవ్‌లో 18 మందిపై కేసులు నమోదు

డ్రంకెన్‌ డ్రైవ్‌లో 18 మందిపై కేసులు నమోదు - Sakshi

శంషాబాద్‌: నగరంలో చేపట్టిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 18 మందిపై కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జ్లిలా శంషాబాద్‌ మండలం తొండుపల్లి ఔటర్‌ రింగురోడ్డు టోల్‌ గేట్‌, బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం రాత్రి  పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు జరిపారు. ఈ  తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతన్న18 మందిపై ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎయిర్‌ పోర్ట్‌ ట్రాఫిక్‌ పోలీసులు  5 కార్లు, 2 డీసీఎంలు, 4 ఆటోలు, 7 ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top