షబ్బీర్ అలీపై దాడి కేసులో నలుగురి అరెస్ట్
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ శాసనమండలి విపక్షనేత షబ్బీర్అలీపై దాడి కేసులో మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం మధ్యాహ్నం కషప్, అబేద్, మసియుద్దీన్, మిస్బా పహిల్వాన్ లను అరెస్టు చేశారు. అనంతరం వీరిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వీరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
నేతలపై దాడులకు పాల్పడిన ఘటనను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, గవర్నర్ జోక్యం చేసుకొని సెక్షన్ 8 ను అమలు చేయాలని ఆ పార్టీ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్ కోరారు.
మరిన్ని వార్తలు