పెట్రోల్ బంకులో పెట్రోలుతోపాటు నీరు

పెట్రోల్ బంకులో పెట్రోలుతోపాటు నీరు - Sakshi


హైదరాబాద్ : చైతన్యపురిలోని హెచ్‌పీ పెట్రోల్ బంకులో శుక్రవారం పెట్రోలు కొట్టించుకున్న వాహనదారులకు పెట్రోలుతో పాటు నీరు కూడా వచ్చింది. ఓ వ్యక్తి బాటిల్‌లో పెట్రోల్ పోయించుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి పెట్రోల్ బంకు యజమాన్యాన్ని ఈ విషయం గురించి అడగటంతో.. వారు భూగర్భంలోని ట్యాంకర్‌ను పరిశీలించగా అందులో నీళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పెట్రోలు కొట్టించుకున్నవారికి తిరిగి డబ్బులు ఇచ్చేశారు. కాగా కొంతమంది వ్యక్తులు ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top