టీ.సచివాలయం తరలింపుపై పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం తరలింపుపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. సరైన ఆధారాలు లేకుండా పిటిషన్ వేసినందుకు న్యాయస్థానం పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్పై ప్రశ్నించింది. కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు పిటిషనర్కు హైకోర్టు వెయ్యి రూపాయిలు జరిమానా విధించింది.
కాగా ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాస్తు దోషంతో సచివాలయం తరలించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆప్ పార్టీకి చెందిన ఓ నేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాస్తు దోషం పేరిట రూ. 150 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.