ముందరి తాండలో సింహం సంచారం


గణపురం: మహబూబ్‌నగర్ జిల్లాలోని గణపురం మండలం ముందరితాండ సమీపంలోని కుక్కలగుట్టలో సింహం సంచారం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనతో  తాండవాసుల్లో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సింహం ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎప్పుడు ఏమవుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top