పడుకుంటే చనిపోతారని ప్రజల జాగారం
హైదరాబాద్: బుధవారం రాత్రి పడుకుంటే చనిపోతారనే పుకార్లు ఖమ్మం, నల్లగొండ, వరంగల్, కృష్ణా జిల్లాల్లో వ్యాపించాయి. దీంతో ప్రజలు రాత్రంతా నిద్రపోకుండా జాగారం చేశారు. చాలా ప్రాంతాల్లో జనం ఇళ్లలో నుంచి బయటకు వచ్చి రోడ్లపై మేలుకున్నారు.
అప్పుడే పుట్టిన శిశువు మాట్లాడిందని, ఆవు కడుపున శిశువు జన్మించిందంటూ, రాత్రి పడుకుంటే చనిపోతారని పలు ప్రాంతాలకు వదంతులు వ్యాపించాయి. బంధువులు, ఫోన్ల ద్వారా ఈ పుకార్లు దావానంలా విస్తరించాయి. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు ప్రజలు రోడ్లపైనే గడిపారు.