టైరు పంక్చర్‌.. గరుడ బస్సు బోల్తా






చివ్వెమ్ల: సూర్యాపేట జిల్లా చివ్వెమ్ల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద గరుడ బస్సు ఓ టైర్ పంక్చర్‌ అయింది. దీంతో అకస్మాత్తుగా అదుపుతప్పిన బస్సు పల్టీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ఉన్నట్లు సమాచారం. గరుడ బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top