ఆటో బోల్తా: 13 మందికి గాయాలు
నకిరేకల్: నల్లగొండ జిల్లా నకిరేకల్ తాటికల్ రోడ్లో కూలీలను తీసుకెళుతున్నఆటో బోల్తా పడింది. ఈ సందర్భంగా ఆటోలో ప్రయాణిస్తున్న13 మంది కూలీలు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 లో నకిరేకల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది.