ఆగి ఉన్న రైల్లో అగ్ని ప్రమాదం


ఆదిలాబాద్ క్రైం: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న పార్లి ప్యాసింజర్ రైల్లో గురువారం ఉదయం 3 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రైలు చివరి బోగి పూర్తిగా దగ్దమయింది. అయితే ఆ సమయంలో రైల్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విద్యుద్ఘాతంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం ఎలా సంభవించిందన్న దానిపై పూర్తివివరాలు ఇంకా తెలియరాలేదు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top