మంత్రివర్గంలోకి పరకాల!

మంత్రివర్గంలోకి పరకాల!


సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సమాచార సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్‌ను రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకోనున్నట్లు తెలిసింది. ఆయనను గవర్నర్ నామినేటెడ్ కోటాలో లేదా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.



ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చే నెలలో షెడ్యూల్ వెలువడనుంది. మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోగానే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరకాలను సమాచార సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top