'గ్రూప్-2లో ఇంటర్వ్యూ రద్దు చేయాలి'


ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్) : టీఎస్ పీఎస్సీ ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో గ్రూప్-2లో ఇంటర్వ్యూను వ్యతిరేకిస్తూ విద్యార్ధి సంఘాలు నిరసనకు దిగాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో గురువారం చోటుచేసుకుంది. పలువురు విద్యార్థులు గ్రూప్-2 కొత్త సిలబస్ కాపీలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ పెట్టడంతో నష్టపోతామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top