ఏపీలో పాలధర పెంపు ఏదీ?

ఏపీలో పాలధర పెంపు ఏదీ? - Sakshi


హెరిటేజ్ కోసం పాడి రైతుల ప్రయోజనాలు బలి: మంత్రి హరీశ్



సిద్దిపేట: టీడీపీ అధినేత చంద్రబాబు జేబు సంస్థ హెరిటేజ్‌ను రక్షించుకోవడానికి పాడి రైతుల ప్రయోజనాలను బలిపెట్టారని భారీ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆదివారం మిల్క్‌గ్రిడ్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో విజయ డెయిరీ ఎదగకుండా చేశారని ఆరోపించారు. పాడిపరిశ్రమ రైతులు బతకకుండా వ్యూహాలు పన్నారని ఆరోపించారు.



సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడంతో రైతుల సమస్యల మూలాలు తెలిసి లీటర్ పాలధరను రూ. 4 పెంచారని, తద్వారా ఇక్కడి రైతులకు పరిశ్రమ లాభదాయకంగా మారుతోందన్నారు. ఇదే సమయంలో ఏపీలో పాల ధరను అక్కడి ప్రభుత్వం పెంచలేదన్నారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top