లారీ ఢీకొని ఒకరు మృతి


శ్రీరాంపూర్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాతపడగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీరాంపూర్ మండలానికి చెందిన నాగరాజు, సుచిత దంపతులు తమ నాలుగు నెలల కుమార్తెతో బైక్‌పై మంచిర్యాలకు బయలుదేరారు. సీసీ కాంప్లెక్స్ సమీపంలో వారి బైక్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే చనిపోగా సుచిత తీవ్రంగా గాయపడింది. చిన్నారి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top