కారుబోల్తా పడి ఆరుగురికి గాయాలు
మదనాపురం: కొత్తకోట మండల కేంద్రంలోని బైపాస్ వద్ద 44 వ జాతీయ రహదారిపై శనివారం అదుపు తప్పి కారు బోల్తా పడిన దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బెంగుళూరు నుంచి హైదరాబాదు లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి చూసేందుకు కారులో బయలుదేరారు. కొత్తకోట సమీపంలోని బైపాస్ వద్ద వారు ప్రయణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది.
దాంతో కారు ప్రయణిస్తున్న డ్రైవర్ మోరేష్, కిరణ్,సత్యశ్రీ, సూర్యశ్రీ, నీలిమా, తేజా,మోరేశ్వర్ గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు.చికిత్స పొందుతూ డ్రైవర్ మోరేష్ మృతిచెందాడు.మరొ క్షతగాత్రుడు మోరేశ్వర్ పరస్థితి ఆందోళన కరంగా ఉండటంతో కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈసంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్సై సత్తార్ తెలిపారు.