ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
ఖమ్మం (తిరుమలాయపాలెం) : తిరుమలాయపాలెం మండలం బ్రహ్మాయిగూడెం వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వాళ్లలో ఐదుగురు బస్సులో ఇరుక్కుపోయారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వారిని బయటికి తీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.