27న జిల్లాకు కేసీఆర్


సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాలవారీగా పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 27న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన తాండూరు చేరుకుంటారు.



అక్కడినుంచి 12.40 గంటలకు పరిగి, 1.20 గంటలకు వికారాబాద్ మీదుగా పర్యటన సాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు మేడ్చల్ చేరుకుంటారు. అనంతరం 2.40 గంటలకు మెదక్ జిల్లా పటాన్‌చెరు బయలుదేరుతారు. అక్కణ్నుంచి తిరిగి 3.20 గంటలకు ఎల్‌బీనగర్‌కు వస్తారు. సాయంత్రం 4గంటలకు ఉప్పల్, 4.40 గంటలకు కుత్బుల్లాపూర్‌లో పర్యటిస్తారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top