బాలిక నిశ్చితార్థాన్ని ఆపిన అధికారులు


చండూరు(నల్గొండ) : ఓ మైనర్‌ బాలిక కు నిశ్చితార్థాన్ని ఐసీడీఎస్‌ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన గుండ్రపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కస్తాల గ్రామానికి చెందిన ఓ బాలిక చండూరు హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. ఈమె తల్లి కొంతకాలం కింద చనిపోయింది. దీంతో తండ్రి వెంకన్న ఆమె ఆలనాపాలన చూస్తున్నాడు. ఈ క్రమంలో గుండ్రపల్లికి చెందిన బాలిక మేనమామ శంకర్‌ మర్రిగూడ మండలం ఒట్టిపల్లి గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో పెళ్లి చేసేందుకు  నిర్ణయించాడు.


రెండు రోజుల్లో నిశ్చితార్ధం పెట్టుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ జయమ్మ ఏఎస్‌ఐ శంకరయ్యతో కలిసి గ్రామానికి చేరుకుని బాలిక బంధువులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దాంతో బాలికకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు పెళ్లి చేయమని కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top