కేబినెట్లో ఒక్క మహిళా లేదు: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం రాష్ట్ర ప్రజలను నిరాశకు గురిచేసిందని శాసనమం డలిలో విపక్షనేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభించడంలేదన్నారు. కేబినెట్లో ప్రాతినిధ్యం కల్చించ లేదని, ఎమ్మెల్సీలుగా ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. దేశం మొత్తం మీద మహిళలకు కేబినెట్లో చోటులేని రాష్ట్రం తెలంగాణనేనన్నారు.
బుధవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మా నంపై మండలిలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో సిజేరి యన్ ద్వారా ప్రసవాలు అవుతున్నాయని, దీని వెనుక వందల కోట్ల కుంభకోణం ఉందని ఆరోపించారు. తమది అవినీతిరహిత ప్రభుత్వమని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, తెలంగాణ భవన్ కట్టడానికి, నమస్తే తెలంగాణ దినపత్రిక, టీ న్యూస్ చానల్, తెలంగాణ టుడే పత్రికల ఏర్పాటుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో 7 దశాబ్దాలుగా కీలకపాత్రను పోషిస్తున్న కాంగ్రెస్పార్టీకి సొంత కార్యాలయ భవనం లేదని, గాంధీభవన్ కూడా అద్దెభవనంలోనే కొనసాగుతోందని అన్నారు.