మున్సిపల్ సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ


కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం మంగళవారం ప్రారంభమైంది. బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా లేవని, ప్రాధాన్యతా అంశాలను విస్మరించారని మీడియాలో మంగళవారం కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మీడియాను అనుమతించలేదు. ఎలాగైనా సరే, బడ్జెట్‌ను ఆమోదింపజేయాలని పాలకవర్గం పట్టుదలతో ఉంది. కాగా, తమను సమావేశంలోకి అనుమతించకపోవటంపై మీడియా ప్రతినిధులు నిరసన తెలిపారు. పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు మద్దతుగా వైఎస్సార్ సీపీ, సీపీఎం నాయకులు కార్యాలయం ఎదుట బైఠాయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top