నిజాంను పొగిడితే ఊరుకోరు

నిజాంను పొగిడితే ఊరుకోరు - Sakshi


పొల్సాని మురళీధర్‌రావు



 పరకాల: ‘కేసీఆర్ మీరు చెప్పినట్లుగా నిజాం ఆదర్శ పాలనపై చర్చించేందుకు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా.. నిజాం గుణగణాలపై పరకాల చౌరస్తాలో మాట్లాడుకుందాం.. చరిత్రను వక్రీకరించి నిజాంను పొడిగితే బట్టలూడదీసి కొడతారు’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు హెచ్చరించారు. అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని బుధవారం అమరధామంలో అమరవీరులకు నివాళులు అర్పించారు.



మళ్లీ జమిందారి వ్యవస్థకు ప్రాణం పోసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అధికారం కోసం దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లితే ఖబర్దార్ అని హెచ్చరించారు.  కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు ఏమాత్రం ఒకే దారిలో నడుస్తున్నాయన్నారు. తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top