కుకునూరుపల్లికి కొత్త ఎస్సై
► బాధ్యతలు స్వీకరించిన సంతోష్కుమార్
కొండపాక(గజ్వేల్): సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కుకునూరుపల్లి ఎస్సైగా జి.సంతోష్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కుకునూరుపల్లి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తూ.. ఎస్ఐ ప్రభాకర్రెడ్డి ఈ నెల 14న సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలి సిందే. ఈ క్రమంలో కుకునూరుపల్లి పోలీసు స్టేషన్లో ఎస్సై పోస్టు ఖాళీ అయ్యింది. దీంతో మెదక్ రూరల్ పోలీసుస్టేషన్ ఎస్సైగా పనిచేసిన జి.సంతోష్కుమార్కు ఉన్నతాధికారులు తాజాగా పోస్టింగ్ ఇచ్చారు.