సకల సదుపాయాలతో కొత్త ఇళ్లు:కెసిఆర్

కె.చంద్రశేఖర రావు - Sakshi


హైదరాబాద్: దళితవాడల్లో దరిద్రాన్ని తరిమికొడదామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పిలుపు ఇచ్చారు.  టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్  విజ్ఞప్తి మేరకు కెసిఆర్  సనత్ నగర్లోని ఐడిహెచ్ కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ అక్కడ ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. వెంటనే ఆ ఇళ్లను ఖాళీ చేయమని ఆయన దళితులను కోరారు.



అయిదు నెలలలో సకల సదుపాయాలతో కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణ పనులు రేపటి నుంచే ప్రారంభిస్తున్నట్లు కెసిఆర్ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top