నేరెళ్ల బాధితులను పరామర్శించిన ఎంపీ
ప్రభుత్వం సాయం అందించాక మాట్లాడుతా..: వినోద్కుమార్
వేములవాడ: నేరెళ్ల బాధితులను కరీంనగర్ ఎంపీ బి. వినోద్కుమార్ సోమవారం పరామర్శించారు. వేములవాడలోని ఆస్పత్రిలో ఉన్న బాధితులు పెంట బానయ్య, కోల హరీశ్, చిట్యాల బాలరాజు, బత్తుల మహేశ్, పసుల ఈశ్వర్కుమార్, గంధం గోపాల్ను ఎంపీ కలసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం నుంచి తప్పకుండా సాయం అందుతుందని, బాధితులతో మాట్లాడేదేమీలేదని, సాయం చేశాకే మాట్లాడతానని ఎంపీ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు. నేరెళ్ల ఘటనపై విచారణ జరుగుతోందని, ప్రభుత్వం బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తుందని, విచారణ నివేదిక రాగానే తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష ఉంటుందని ఎంపీ వినోద్కుమార్ విలేకరులకు చెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాతా తాను స్వయంగా జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడానని అన్నారు. జరిగిన ఘటన చాలా బాధాకరమని, బాధితుల గాయాలను పరిశీలించానని తెలిపారు.