సంసారం ఇక్కడ.. సోకులు అక్కడా: నాయిని

సంసారం ఇక్కడ.. సోకులు అక్కడా: నాయిని - Sakshi


సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, అధికారులు మొత్తం అంతా ఇక్కడే ఉంటే మరి కార్మికశాఖ సొమ్ములను విజయవాడకు ఎందుకు పంపారని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రశ్నించారు. సంసారం ఇక్కడ చేసి.. సోకులు అక్కడ పెతారా అంటూ ఎద్దేవా చేశారు.



కార్మిక శాఖలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసినట్లు నాయిని తెలిపారు. అయితే.. ఆయన అహంకార పూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. ముఖ్య కార్యదర్శి రామాంజనేయులు ఆగమేఘాల మీద డబ్బును మళ్లించారని ఆయన అన్నారు. నిదులు విడుదల చేయొద్దంటూ ఆంధ్రాబ్యాంకుకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top