'నయీం అనుచరులతో ప్రాణభయం'

'నయీం అనుచరులతో ప్రాణభయం'


కరీంనగర్: గ్యాంగ్స్టర్ నయీం అనుచరులతో తమకు ప్రాణభయం ఉందని నయీం బాధితులు ఆరోపించారు. కరీంనగర్లో నయీం బాధితులు బుధవారం మీడియాను ఆశ్రయించారు.



ఈ సందర్భంగా బాధితులు వీరలక్ష్మీ, కాంతారావు, రియల్టర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ...14 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ చేశారన్నారు. నగునూరు భూ ఆక్రమణలో నయీం, అతని అనుచరులు ఉన్నారని చెప్పారు. భూ ఆక్రమణలతో ప్రమేయమున్న అందరినీ అరెస్ట్ చేయాలని నయీం బాధితులు డిమాండ్ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top