కేసీఆర్.. ఢిల్లీకి రండి: మోదీ లేఖ
సాక్షి, హైదరాబాద్: ‘నీతి ఆయోగ్’ పాలకమండలి తొలి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చే నెల 8న ఢిల్లీకి రావాల్సిందిగా తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావును ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
ఈ మేరకు ఆయనతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని లేఖ రాసినట్టు సమాచారం. ప్రణాళిక సంఘానికి బదులుగా కేంద్రం ఇటీవలే ‘నీతి ఆయోగ్’ను ఏర్పాటు చేయడం తెలిసిందే.