రేవంత్ రెడ్డిపై నాంపల్లి కోర్టు ఆగ్రహం
హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన కోర్టుకు గైర్హాజరు అయ్యారు. ఏప్రిల్ 21న రేవంత్ రెడ్డి విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కాగా . మెడికల్ కాలేజీ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్తోపాటు మరి కొంతమందికి ముడుపులు అందాయని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. దాంతో ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.