రేవంత్ రెడ్డిపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇంజినీరింగ్ కాలేజీల వ్యవహారంలో ముడుపులు ముట్టాయంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ న్యాయవాదులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది.
మెడికల్ కళాశాలల్లో మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ సీట్ల ఫీజు పెంపుతో ముఖ్యమంత్రి కేసీఆర్కు రూ.వంద కోట్ల ముడుపులు ముట్టాయని తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.