జైపూర్లో పోలీస్ స్టేషన్ ప్రారంభించిన నాయిని


ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్నలతోపాటు ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తదితరులు పాల్గొన్నారు.


తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top