ఎంపీటీసీ భర్తపై కత్తులతో దాడి


హుజూర్‌నగర్‌: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ఎంపీటీసీ భర్త పై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఎంపీటీసీ భర్త బత్తుల నాగరాజుపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర గాయాలైన ఆయనను హూజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించారు. భూ వివాదం నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top