చేవెళ్ల మండలంలో ఎంపీ పర్యటన
చేవెళ్ల(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పర్యటించారు. మంజీర నది నుంచి గ్రామాలకు సరఫరా అయ్యే మంచి నీటిని తరలించే పైపు లైన్లను ఆయన పరిశీలించారు. దుబ్బన్నగూడెం, దామరగిద్ద, రామన్న గూడ గ్రామాల్లో ఆయన అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.