ఓవైసీ వినతికి స్పందించిన ఎంపీ కవిత
నిజామాబాద్: జిల్లాలో ముస్లిం ప్రిన్సిపాల్ పై దాడి చేసిన ఏబీవీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీటర్ వేదికగా చేసిన వినతికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని అయిలాపూర్ ప్రభత్వ కళాశాల ప్రిన్సిపాల్ యాకీసుద్దీన్ షూ వేసుకొని జాతీయజెండాను ఎగురవేశారని కొందరు ఏబీవీపీ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయించి నిందితులను అరెస్టు చేయించాలని ఎంపీ అసదుద్దీన్ కవితను కోరారు. దీనిపై ఎంపీ కవిత స్పందించి తగిన చర్యలు తీసుకొని వారిని అరెస్టు చేయించామన్నారు.
@TelanganaCMO @MinIT_Telangana @RaoKavitha @TelanganaDGP these rogues should be arrested by @cpnizamabad how can they assault a principal https://t.co/SJsgdTviQW
— Asaduddin Owaisi (@asadowaisi) 16 August 2017
They have been detained @asadowaisi bhai https://t.co/XnOmbi1Ukc
— Kavitha Kalvakuntla (@RaoKavitha) 16 August 2017