ఓవైసీ వినతికి స్పందించిన ఎంపీ కవిత


నిజామాబాద్: జిల్లాలో ముస్లిం ప్రిన్సిపాల్ పై దాడి చేసిన ఏబీవీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీటర్‌ వేదికగా చేసిన వినతికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.

 

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని అయిలాపూర్‌ ప్రభత్వ కళాశాల ప్రిన్సిపాల్ యాకీసుద్దీన్‌ షూ వేసుకొని జాతీయజెండాను ఎగురవేశారని కొందరు ఏబీవీపీ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయించి నిందితులను అరెస్టు చేయించాలని ఎంపీ అసదుద్దీన్ కవితను కోరారు. దీనిపై ఎంపీ కవిత స్పందించి తగిన చర్యలు తీసుకొని వారిని అరెస్టు చేయించామన్నారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top