రిషితేశ్వరి ఆత్మహత్యపై విచారణ జరపాలి


ఏపీ సీఎం చంద్రబాబుకు ఎంపీ కవిత లేఖ




 సాక్షి, హైదరాబాద్: నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. సమాజానికి దారిచూపాల్సిన విశ్వవిద్యాలయాలు అరాచక శక్తుల చేతులకు చిక్కి ఆటవిక ప్రవృత్తికి వేదికలవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులకు పలుకుబడి ఉన్న వారి అండదండలున్నాయనే వార్తలు వస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండి ఆడకూతుళ్లు బలి కాకుండా చూడాలని కోరారు.


 




 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top