మోటారు దొంగల అరెస్ట్
వరంగల్: మోటార్లను దొంగిలిస్తున్న ముఠాను వరంగల్ జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ధర్మసాగరం మండలం వేలూరు గ్రామంలో చోటుచేసుకుంది. తిరుమల్, భాస్కర్ ,కనకం అనే ముగ్గురు వ్యక్తులు జల్సాలకు అలవాటుపడి పంట పొలాల వద్ద ఉన్న మోటార్లను దొంగిలించి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.5.28 లక్షల విలువ చేసే 45 మోటార్లను, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మోటార్లను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ఇద్దరినీ కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.