ప్రియుడితో విభేదాలు: పిల్లలకు విషమిచ్చిన తల్లి


నల్గొండ:జిల్లాలోని నార్కెట్ పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో విభేదాల కారణంగా ఓ తల్లి  తన పిల్లలకు విషమిచ్చిన ఘటన ఆదివారం స్థానికంగా కలకలం సృష్టించింది. పిల్లలకు ఆలనా పాలనా చూడాల్సిన తల్లే.. పిల్లలపాలిట యమపాశంలా మారింది. పేగు బంధాన్నిమరచిన తల్లి..  పిల్లలపై విషప్రయోగం చేసింది. ఈ ఘటనలో పెద్ద కుమార్తె దీపిక(4) మృతి చెందగా,  మరో కూతురి పరిస్థితి విషమంగా ఉంది.


 


గత కొంతకాలంగా పిల్లల కారణంగా ఆమెకు ప్రియునికి మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో  తన ఇద్దరి పిలల్ని అంతమొందిచాలనుకుని విష ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top