పిల్లలతో సహా బావిలో దూకిన తల్లి


ఆదిలాబాద్: ఇద్దరు చిన్నారులతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన రాణి(26) తన ఇద్దరు పిల్లలు అర్జున్(5), అక్షర(3) తో సహా ఈ రోజు వ్యవసాయ బావిలోదూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top