పిల్లలకు ఉరేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం
మహబూబ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. అత్తాకోడళ్ల తగాదా ముగ్గురు చిన్న పిల్లల ప్రాణాలు తీసింది. బాలానగర్ మండలం గంగాధరపల్లిలో ఈ సంఘటన జరిగింది. కౌసల్య అనే మహిళకు ముగ్గురు పిల్లలున్నారు. ఆమె భర్త తరచు తాగి వచ్చి ఆమెతో గొడవపడేవాడు. దానికితోడు అత్తా కోడళ్ల మధ్య కూడా తరచు వివాదాలు జరిగేవి.
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కౌసల్య.. ప్రాణాలు తీసుకోవాలనుకుంది. అయితే, తాను లేకపోతే పిల్లలు అన్యాయం అవుతారని భావించి ముందుగా తన ముగ్గురు పిల్లలకు ఉరి వేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ఈలోపు చుట్టుపక్కల వాళ్లు గమనించి.. ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. విషమ పరిస్థితుల్లో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.