చిన్నారికి ఉరేసి ... ఆత్మహత్య చేసుకున్న తల్లి
ఖమ్మం : కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారికి ఉరివేసి తనూ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు... బచ్చువారిగూడెం గ్రామానికి చెందిన కట్టం బుల్లెమ్మ(24) భర్త వేధింపులు భరించలేక మూడేళ్ల క్రితం భర్తతో విడిపోయి వేరుగా నివసిస్తుంది.
ఆమెకు మూడేళ్ల కుమార్తె పూజశ్రీ ఉంది. భర్తతో విడిపోయినా... తరచు వచ్చి అతడు ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. దాంతో జీవితంపై విరక్తి చెందిన బుల్లెమ్మ... కుమార్తెకి ఉరివేసి తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
అశ్వారావుపేట పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు