కూలిన ఇంటిపైకప్పు : తల్లీ కూతుళ్లు మృతి


ఖమ్మం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని మేదరబస్తీలో బుధవారం అర్థరాత్రి విషాదం చోటు చేసుకుంది. పాతబడిన పెంకుటిలు పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో నిద్రలో ఉన్న తల్లి సుధారాణి (30), కుమార్తెతలు భార్గవి, కీర్తనలు మృతి చెందారు. భర్త గోవర్ధన్ స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... సహాయక చర్యలు చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top