క్షణికావేశానికి మూడు ప్రాణాలు బలి


మహబూబ్‌నగర్: ఓ తల్లి తన పిల్లల పాలిట మృత్యుదేవతగా మారింది. స్వల్ప ఘర్షణతో ఆవేశానికి లోనై ముగ్గురు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో తల్లితోపాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడలో జరిగింది. కృష్ణవేణి(30)కి కల్యాణి(5), ప్రశాంతి(2)తోపాటు మరో కుమారుడు ఉన్నారు. వీరికి, కృష్ణవేణి బావగారి పిల్లలకు మధ్య మంగళవారం రాత్రి ఘర్షణ జరిగింది.


దీంతో మనస్తాపం చెందిన కృష్ణవేణి అర్ధరాత్రి సమయంలో ముగ్గురు పిల్లపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. తర్వాత తనపై కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు వారిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణవేణి, కల్యాణి, ప్రశాంతి మృతి చెందారు. ఆమె కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top