నేడు ‘మోడల్’ టీచర్ల సామూహిక సెలవులు


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు పదో పీఆర్‌సీ వర్తింపులో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూల్ టీచర్లు సామూహిక సెలవులు పెట్టి, పాఠశాలల ముందు ధర్నాలు చేయనున్నట్లు రాష్ట్ర మోడల్ స్కూల్స్ అసోసియేషన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.


అలాగే 9 నుంచి అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ ఆందోళనల్లో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. పీఆర్సీ అమలుతో పాటు సర్వీసు రూల్స్ ఇవ్వాలని, హెల్త్ కార్డులను అందజేయాలని తదితర డిమాండ్లతో ఆందోళనలు చేయనున్నట్లు పేర్కొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top