జెడ్పీ సమావేశం నుంచి ఎమ్మెల్యే వాకౌట్
ఖమ్మం జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం నుంచి ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం వాకౌట్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో తాను ప్రతిపాదించిన పంచాయతీలను తొలగించారని ఆయన ఆరోపించారు. ఆదర్శ గ్రామాలుగా నియోజకవర్గం పరిధిలో తాను పేర్కొన్న నాలుగు పంచాయతీలను తొలగించి అధికారులు కొత్తవాటికి చోటు కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, పోడు భూముల విషయంలో గిరిజనులను అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన జెడ్పీ సర్వసభ్య సమావేశం నుంచి వెళ్లిపోయారు.