సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే


రంగశాయిపేట(వరంగల్): వరంగల్ జిల్లా రంగశాయిపేట మండలంలోని శ్రీసాయినగర్‌కాలనీలో సీసీ రోడ్డు పనులను వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదివారం ప్రారంభించారు. దాదాపు రూ.30 లక్షల విలువైన రోడ్డు పనులను విడుదల చేయించినట్లు ఆయన తెలిపారు.


అదే విధంగా ఇటీవల సంక్రాంతి సందర్భంగా ఆ కాలనీలో నిర్వహించిన ముగ్గులు పోటీలు, ఆటల్లో విజేతలుగా నిలిచినవారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా స్థానిక జడ్పీటీసీ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top