ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ముప్పు
ఆదిలాబాద్: ఆర్టీసీ బస్సుకు ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. లక్ష్మణ్ చాంద నుంచి చింతల్ చాందను వెళుతున్న ఆర్టీసీ బస్సు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొట్టింది. ట్రాన్స్ఫార్మర్ లో విద్యుత్ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 17 మంది ప్రయాణికులున్నారు. ముప్పు తప్పడంతో బస్సులో ఉన్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు.