టీఆర్‌ఎస్‌కు ఎదురు లేదు: తుమ్మల

టీఆర్‌ఎస్‌కు ఎదురు లేదు: తుమ్మల


సాక్షి, వరంగల్‌: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ప్రతిపక్ష పార్టీల్లో సరైన నాయకత్వం లేదన్నారు. 2019లో అధికారంలోకి వస్తామని కలలుకంటున్న ప్రతిపక్ష పార్టీల ఆశలు కలలుగానే మిగులుతాయని వ్యాఖ్యానించారు.



టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ 27న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగసభ ప్రదేశానికి బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వచ్చారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు జావగారి పోయాయని, టీఆర్‌ఎస్‌కు పోటీ ఇచ్చే పార్టీలు లేవన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top