జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకొస్తా: మహేందర్ రెడ్డి
హైదరాబాద్: 1500 కోట్లతో రూపాయలతో అభివృద్ధి ప్రణాళిక సిద్ధమని జెడ్పీ ఛైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి తెలిపారు. గురువారం జరిగిన రంగారెడ్డి జెడ్పీ సమావేశంలో జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సభ్యుల తీర్మానం చేశారు.
రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని సభ్యులకు జెడ్పీ ఛైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం నుంచి జిల్లా అభివృద్ధి కోసం పూర్తిస్థాయి నిధులు తీసుకొస్తానని ఈ సమావేశంలో మంత్రి మహేందర్రెడ్డి హామీ ఇచ్చారు.