సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటన


రాజన్న సిరిసిల్ల: తెలంగాణాలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాను అగ్రభాగాన నిలిపేందుకే పట్టణ ఏరియా ఆసుపత్రిలో రూ. యాభై కోట్ల వ్యయంతో బ్లడ్ బ్యాంక్, డయాలసిస్ సెంటర్‌, పది పడకలతో ఐసీయూలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మంత్రి కేటీఆర్‌ మంగళవారం సిరిసల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందేందుకే ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రిల చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా నలభై సెంటర్లలో వెయ్యి డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

 

సిరిసిల్ల విద్యార్థినిల భవిష్యత్తుకై రూ. 36.5 కోట్లతో నర్సింగ్ కళాశాల, అలాగే రూ.13 కోట్లతో 50 పడకల మాతా శిశు సంక్షేమ కేంద్రానికి శంకుస్థాపన చేసుకున్నామని,  వచ్చే సంవత్సరం నుంచి వీటిని ప్రారంభిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రిల ప్రత్యేక చొరవతోనే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. తెలంగాణా ఆడపడుచులకు ఇస్తున్న పావలా వడ్డీ రుణాలలో భాగంగా రూ.12 కోట్ల చెక్కును మంత్రి కేటీఆర్‌ అందజేశారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top