కేసీఆర్ను నల్లగొండకు పంపిస్తరా?
- గజ్వేల్ ప్రజలను అడిగిన మంత్రి హరీశ్రావు
- అంగీకరించేది లేదన్న జనం
గజ్వేల్: ‘వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యాన్ని నల్లగొండ జిల్లా ప్రజలు కోరుకుంటున్నరు.. కేసీఆర్ అక్కడికి వస్తే అభివృద్ధి అయితదని ఆశపడుతుండ్రు.. అందుకు మీరు అంగీకరిస్తారా.. సీఎంను పంపిస్తరా?’అని మంత్రి హరీశ్రావు సభాము ఖంగా ప్రజల్ని ప్రశ్నించారు. ప్రజలంతా ‘వద్దు.. వద్దు’ అంటూ ముకుమ్మడిగా చేతులు అడ్డంగా ఊపారు. దీంతో హరీశ్రావు చిరు నవ్వు చిందిస్తూ ‘సీఎం కేసీఆర్ అంటే మీకు ఎంతో అభిమానముంది. ఆయన మీతోనే ఉంటారు’ అని అన్నారు. బుధవారం గజ్వేల్ పట్టణంలో రూ.7.20 కోట్లతో నిర్మించే ఇంటి గ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్, రూ. 3.19 కోట్లతో నిర్మించే పత్తి మార్కెట్యార్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పాతూరు రహదారి పక్కన రూ. 30 లక్షలతో నిర్మించిన రైతు కూరగాయల మార్కెట్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎంపై ప్రస్తావన తెచ్చారు. ‘కేసీఆర్ ఎక్కడున్నా... మనసంతా మీపైనే.. ఎప్పుడూ మీ గురించే ఆలోచన. ఇక్కడి నుంచి గెలిచి సీఎం అయినంక ఈ ప్రాంతం ఎట్ల మారిందో మీరంతా చూస్తుండ్రు. ముఖ్యమంత్రి నేతృత్వంలో గజ్వేల్ అభివృద్ధిలో రోల్మోడల్గా మారబోతుంది’అన్నారు. వచ్చే ఏడాదికి గజ్వేల్ నియోజకవర్గంలోని లక్షా 50వేల ఎకరాకు గోదావరి జలాలను అందిస్తామన్నారు.