అధికారం, పదవి శాశ్వతం కావు: హరీశ్
సిద్దిపేట: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవడమే నిజమైన అభివృద్ధి అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారం, పదవి శాశ్వతం కాదని .. రేపటి మన పిల్లల భవిష్యత్కు ఉపయోగపడేలా నాలుగు మంచి పనులు చేయాలి. తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచించకుండా దీర్ఘకాల లాభాలనిచ్చే పనులు చేయాలని సూచించారు.