హరీశ్రావు ఆకస్మిక తనిఖీలు
సాగునీటి శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యలయం జలసౌధలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆకస్మిక తనిఖీలు చేశారు. దాదాపు నాలుగోవంతు మంది ఉద్యోగులు ఉదయం 11 గంటలు దాటిని కూడా విధులకు హాజరు కాని విషయం ఈ తనిఖీలలో వెల్లడైంది. దీంతో హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమయపాలన పాటించకపోవడం వలన ఫైళ్ల క్లియరెన్స్ ఆలస్యం అవుతుందని, తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరాలంటే తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని హరీశ్ రావు అన్నారు.